చత్తీస్ గఢ్ ,బొరాయ్ జవహర్ నవోదయ పాఠశాల లో తెలుగు వెలుగులు..
చత్తీస్ గఢ్ ,బొరాయ్ జవహర్ నవోదయ పాఠశాల లో తెలుగు వెలుగులు..
చత్తీస్ గఢ్ రాష్ట్రం లోని,భిలాయ్ నుండి సుమారు 20 కి.మీ.దూరంలో వున్న కుగ్రామం,బొరాయ్.
ఆ గ్రామంలో వున్న జవహర్ నవోదయ
విద్యాలయంలోనికి అడుగిడగానే మనల్ని అచ్చెరువొందించే విషయం..తెలుగులో కూడా బోర్డు వుండటం…
తేరుకొని లోపలికి వెళితే…నోటీసు బోర్డు లాంటి పెద్దబోర్డుపై పిల్లలు రాసిన తెలుగు కధలు,పద్యాలు
ఆవో తెలుగు సీఖేన్…అని ఒక తెలుగు పదం,
హిందీలో అర్ధం,..
నిజంగా అక్కడి తెలుగు అధ్యాపకురాలు,కుమారి హేమ గారు ఎంతైనా అభినందనీయురాలు…
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.




ఆర్యా మీ బ్లాగు నూతన తరహాలో కొనసాగిస్తున్నారు. బాగుంది. చత్తీస్ ఘఢ్ లోనే కాకుండా,మధ్య ఒరిస్సాలో… కోదు జాతి వారు ఓ ట్రైబల్ తెగ. వారు ఇంట్లో మాట్లాడె భాష తెలుగు. ఎప్పుడో నలభై అయిదు సంవత్సరాల క్రితపు పరిస్థితి.యిప్పుడు ఎలావుందో మరి. అభినంద్నలతో ..నూతక్కి రాఘవేంద్ర రావు.